మనమే మీడియా:మెరకముడిదాం మండలం,గర్భం గ్రామం,
రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే కిమిడి కళావెంకట రావు గారు సూచనలతో రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు ఆదేశాలు మేరకు మెరకముడిదాం మండలం గర్భం గ్రామంలో జరిగిన “రైతన్న మీకోసం” వారోత్సవాల్లో *వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్రీ తాడ్డి చంద్ర శేఖర్ గారు డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొన్నారు*
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించడంతో పాటు, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అన్నారు. గర్భం గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో రైతులు పడిన ఇబ్బందులను తొలగించి, వ్యవసాయాన్ని పండుగలా మార్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుందని తెలిపారు.

